కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా రెండు రోజుల భారత్ బంద్ కు ట్రేడ్ యూనియన్లు పిలుపునిచ్చాయి. ఈ మేరకు దేశంలోని పలు రాష్ట్రాల్లో బంద్ మొదలైంది. అఖిల భారత బ్యాంకు ఉద్యోగుల సంఘం దీనికి మద్దతునిచ్చింది.
ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, హెచ్ఎమ్ఎస్, సీఐటీయూ సహా పలు సంఘాలు బంద్ నిర్వహిస్తున్నాయి. హర్యానా చండీగఢ్ ట్రేడ్ యూనియన్లలో ఎస్మా విధించే అవకాశం ఉన్నప్పటికీ రోడ్డు మార్గాలు, రవాణా, విద్యుత్ శాఖల కార్మికులు కూడా సమ్మెలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు. ఏఐయూటీయూసీ, టీయూసీసీ, సెవా, ఏఐసీసీటీయూ, ఎల్పీఎఫ్, యూటీయూసీతో కూడిన ఉమ్మడి ఫోరం బంద్ చేపడుతోంది.
బంద్ కారణంగా పలు రాష్ట్రాల్లో రవాణా, వ్యాపార, వాణిజ్యాలతో పాటు బ్యాంకింగ్ ఇతర కార్యకలాపాలు కూడా నిలిచిపోనున్నాయి. బ్యాంకు శాఖలు, కార్యాలయాలు సజావుగా సాగేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటున్నట్లు బెంగళూరుకు చెందిన కెనరా బ్యాంక్ తెలిపింది. అయితే, బ్యాంక్ పనితీరుపై బంద్ ప్రభావం పడబోతంది. ప్రైవేట్ బ్యాంక్ RBL తమ బ్యాంక్ యూనియన్లు AIBOA, AIBEAలతో అనుబంధంగా ఉన్నాయని, ఈ యూనియన్లతో సంబంధం ఉన్న ఉద్యోగులు సమ్మెలో పాల్గొనవచ్చని పేర్కొంది. మార్చి 31న కూడా బ్యాంకింగ్ సేవలు ప్రభావితం కానున్నాయి.
