నీతి ఆయోగ్ సమీక్ష సమావేశములో పాల్గొన్న మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

మహా వెలుగు, రిపోర్టర్ ప్రసాద్ అనసూరి మంథని నియోజకవర్గం ఏప్రిల్ 25: దేవాలయాల అభివృద్ధి కి నిధులు కేటాయించండని మంథని ఎమ్మెల్యే దుద్దిళ్ళ శ్రీధర్ బాబు పేర్కొన్నారు.కేంద్ర పర్యాటక , సాస్కృతిక శాఖ మంత్రి కిషన్ రెడ్డి కి వినతి పత్రం అందజేశారు.

శ్రీధర్ బాబు మాట్లాడుతూ…మంథని నియోజకవర్గంలో వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని ,మహదేవపూర్ మండలంలోని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవాలయానికి మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక తెలంగాణా మరియు ఇంక అనేక రాష్ట్రాల నుండి చాలా మంది భక్తులు నిత్యం దర్శనం చేసుకుంటారని ఈ ప్రసిద్ధి గాంచిన పుణ్యక్షేత్రన్ని పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి ప్రసాదము పథకం కింద నిధులు మంజూరు చేయగలరని వారు కోరారు.

ప్రతాపగిరి గ్రామాములోని గత పురాతనమైన కాకతీయుల కాలంలో ప్రతాపుడు ఇక్కడ నిర్మించిన నిర్మాణాలు చాలా ఉన్నాయని ,నిత్యం పర్యాటకులు వెళ్తూ ఉంటారని ఇక్కడ ఈ గుట్టపై ప్రతి సంవత్సరం ఫిబ్రవరి నెలలో లక్ష్మీ దేవర జాతర అతి ఘనంగా నిర్వహిస్తున్నారని . ఈ ప్రతాపగిరి లక్ష్మి దేవర గుట్టకు ఈ జాతర చాలా మంది భక్తులు ఇతర రాష్ట్రాల నుండి వస్తున్నారు. కావున ప్రతాపగిరి గుట్టను టూరిజం శాఖ నుండి గుర్తించి ప్రత్యేక నిధులు కేటాయించి అభివృద్ధి నిధులు కేటాయించాలన్నారు.

మంథని నియోజక వర్గానికి సంబంధించి మాహదేవ్ పూర్ లేదా కాటారం మండలం కేంద్రంగా వైద్య కళాశాలను ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రిని కోరారు

నియోజకవర్గంలోని అతి పురాతనమైన పెద్దపెల్లి జిల్లా రామగిరి మండలం చెందిన రామగిరి ఖిల్లా లో పురాతన కట్టడాలు, నిత్యం ఖిల్లా కి వెళ్లడానికి శ్రావణమాసంలో చాలామంది పర్యాటకులు మరియు భక్తులు గుట్ట వద్దకు వెళుతుంటారు. ఈ రామగిరి ఖిల్లాను పర్యాటక ప్రాంతాముగా గుర్తించి అభివృద్ధికి నిధులు కేటాయించగలరని మంత్రిని కోరారు.

మహాదేవపూర్ ప్రాంతంలో అనేక సంవత్సరాలు గా ITDA కేంద్రము పెండింగ్ గా ఉంది.వెంటనే పూర్తి చేయలి. భూపాలపల్లి ,ములుగు జిల్లా లో అడవి లో అనేక హౌషధా మొక్కలు ఉంటాయి కనుక ఇక్కడ ఆయుర్వేదిక్ హాస్పిటల్ ఏర్పాటు చేయాలన్నారు.

మంథని నియోజకవర్గం లోని పెద్దపెల్లి జిల్లా మరియు భూపాలపల్లి జిల్లా లోని పలు దేవాలయాలు చాలా సంవత్సరాలు పురాతన ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలు గా ఉండి ఎలాంటి అభివృద్ధి లేకుండా ఉన్న దేవాలయాలకు టూరిజం శాఖ నుండి ప్రత్యేక నిధులు కేటాయించగలరనీ , మంథనీ మండలంలోని గౌతమేశ్వర దేవాలయం ఓంకారేశ్వర దేవాలయం ,కన్నల లోని వెంకటేశ్వర స్వామి దేవాలయం.

రామగిరి మండలంలోని పురాతన రామగిరి ఖిల, సుందిళ్ల శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ,ముత్తారం మండలము ఖమ్మం పల్లి లోని సుందరెల్లి శివాలయం , మచ్చుపేట లోని బాగుల్ల గుట్ట. కమాన్ పూర్ మండలంలోని శ్రీ ఆదివరాహ స్వామి దేవాలయం
మల్హార్ రావు మండలంలోని కొయ్యూరు లోని నాగులమ్మ దేవాలయం , గుడుల దేవాలయం
కాటారం మండలంలోని చింతకాని చెన్నకేశ్వర స్వామి దేవాలయం , ప్రతపగిరి లోని గొంతమ్మ గుట్ట దేవాలయం మహదేవ్ పూర్ కాళేశ్వరం లోని చంద్రశేఖర స్వామి దేవాలయంలాకు టూరిజం శాఖ నుండి ప్రత్యేక నిధులు కేటాయించగలరని మరియు నియోజకవర్గంలోని పలు దేవాలయాలను గుర్తించి వాటిని పర్యాటక శాఖ నుండి అభివృద్ధికి నిధులు కేటాయించగలరని వినతి పత్రం ద్వారా వారు కోరనని వారు తెలిపారు.